ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-01-19T06:07:45+05:30 IST

వేగంగా వస్తున్న ఒక ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
రావులపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇన్నోవా కారు

 కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
రావులపాలెం రూరల్‌, జనవరి 18: వేగంగా వస్తున్న ఒక ఇన్నోవా కారు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విజయవాడకు చెందిన పిల్లి శశికుమార్‌, లావేటి సంపత్‌, బేడీ విజయకుమార్‌, సూర్య, శ్రీను, వంశీ, ఫాయాజ్‌ విశాఖ జిల్లా పాడేరు నుంచి ఇన్నోవా కారులో విజయవాడ బయల్దేరారు. రావులపాడు ఆర్టీసీ గ్యారేజీ వద్దకు వచ్చేసరికి ముందు ఉన్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టారు. ఫాయాజ్‌ పరారీలో ఉన్నాడు.  సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా విశాఖ జిల్లా పాడేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్టు నిర్ధారించారు. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఒకరు పరారీ కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మిగిలిన నలుగురు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. గంజాయి పీల్చి అతి వేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు పది కిలోలు ఉండవచ్చునని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-19T06:07:45+05:30 IST