గోరంట్ల, అంబటి దిష్టిబొమ్మల దహనం
ABN , First Publish Date - 2022-08-07T04:45:05+05:30 IST
మహిళాలోకాన్ని అవమానించేలా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను రాజం పేట పట్టణంలోని ఎన్టిఆర్ సర్కిల్లో శనివారం తెలుగుదేశం పార్టీ నాయ కులు దహనం చేశారు.
రాజంపేట, ఆగస్టు 6: మహిళాలోకాన్ని అవమానించేలా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను రాజం పేట పట్టణంలోని ఎన్టిఆర్ సర్కిల్లో శనివారం తెలుగుదేశం పార్టీ నాయ కులు దహనం చేశారు. వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. తెలుగు మహిళా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు అనసూయమ్మ, మండల నాయకురాలు మిరియాల జ్యోతి, వాణి, పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యంనాయుడు, రూరల్ అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్య, మైనారిటీ నాయకులు అబుబకర్, మైనారిటీ నేత షబానా , పట్టణ మాజీ అధ్యక్షుడు సంజీవరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు వెకంటరమణ, రామ్నగర్ నరసింహ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.