ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-05-16T06:46:07+05:30 IST

భారత రాజ్యాంగాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిననిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకులు దహనం చేశారు.

ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం
ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

మెట్‌పల్లి రూరల్‌, మే 15 : భారత రాజ్యాంగాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిననిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకులు దహనం చేశారు. ఆదివారం మండలంలోని మేడిపల్లి జాతీయ రహదారిపై ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను సర్పంచ్‌ పీసు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవచేసే ఉన్నతమైన పదవిలో ఉండి రాజ్యాంగాన్ని మారుస్తామని అంటూ పిచ్చికూతలు కూస్తున్న ఎంపీ స్థాయిని మరిచి మాట్లాడటం సరియైునది కాదని అన్నారు. ఎన్నికల సమయంలో నియోజక వర్గానికి బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన హామీలను నెరవేచ్చకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రాజ్యాంగం పట్ల తప్పుడు మాటలు మాట్లాడిన ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే నియోజకవర్గంలో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో నాయకులు పింజారి హరీష్‌, పుర్రె మహేష్‌, సుంకరి రమేష్‌, బొబ్బిలి మోహన్‌, బొర్రన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T06:46:07+05:30 IST