గడ్డివాములు దగ్ధం.. రూ.80వేలు నష్టం

ABN , First Publish Date - 2022-05-23T05:50:28+05:30 IST

గడ్డివాములు దగ్ధం.. రూ.80వేలు నష్టం

గడ్డివాములు దగ్ధం.. రూ.80వేలు నష్టం

ఆమనగల్లు, మే 22: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి పొలంలో ఆదివారం తెల్లవారుజామున గడ్డివాములు దగ్ధమయ్యా యి. ఇటీవల రామచంద్రారెడ్డి వరిచేను కోసి పొలంలో ఆరు ట్రాక్టర్ల గడ్డిని వాములుగా వేశాడు. కాగా తెల్లవారుజామున గడ్డివాముల వద్ద మంటలు చెలరేగడంతో సమీప పొలాల రైతులు ఇచ్చిన సమాచారంతో రామచంద్రారెడ్డి పొలం వద్దకు చేరుకోగా అప్పటికే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. దగ్ధమైన గడ్డి విలువ రూ.80వేల వరకు ఉంటుందని, ప్రభుత్వ పరంగా తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పంటించారని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Updated Date - 2022-05-23T05:50:28+05:30 IST