ఎస్సారెస్పీ కాల్వ గండి పూడ్చివేత
ABN , First Publish Date - 2021-04-21T06:10:07+05:30 IST
మండలంలోని ధర్మాపురం శివారు మేగ్యాతండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ(71-డీబీఎం)కు పడిన గండిని మంగళవారం పూడ్చివేశారు.
పెన్పహాడ్, ఏప్రిల్ 20: మండలంలోని ధర్మాపురం శివారు మేగ్యాతండా వద్ద ఎస్సారెస్పీ కాల్వ(71-డీబీఎం)కు పడిన గండిని మంగళవారం పూడ్చివేశారు. ఆదివారం తెల్లవారుజామున కాల్వకు గండిపడిన విషయం విదితమే. మూడు రోజుల తర్వాత పూర్తిస్థాయిలో పూడ్చివేశారు. ఇసుక బస్తాలు, సిమెంట్ డస్ట్ వేసి పూడ్చినట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ బద్రునాయక్, ఏఈ లింగయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ రాములునాయక్, ధర్మాపురం, మేగ్యాతండా సర్పంచ్లు నెమ్మాది నగేష్, అంగోతు నాగమ్మ, కోరాటి వెంకటేశ్వర్లు, సాలం కనకయ్య, సైదా నాయక్, నాగునాయక్, నరేందర్, నర్సింగ్నాయక్ పాల్గొన్నారు.