అంత్యక్రియలను అడ్డుకుంటే చర్యలే: జిల్లా జడ్జి
ABN , First Publish Date - 2020-08-05T20:55:52+05:30 IST
కరోనా కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం సరికాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిచంద్ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన
గుంటూరు: కరోనా కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలను అడ్డుకోవడం సరికాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిచంద్ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో కరోనా మృతుల అంత్యక్రియలను ఎక్కువగా అడ్డుకుంటున్నారని, అంత్యక్రియలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. అంత్యక్రియలు అడ్డుకునే వారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమిన జస్టిస్ గోపిచంద్ హెచ్చరించారు. ప్రజలు మూఢ నమ్మకాలను వదిలేయండని హితవుచెప్పారు. ఎవరి మత విశ్వాసం ప్రకారం వారు అంత్యక్రియలు చేసుకోనివ్వాలని సూచించారు. మండల స్థాయిలో దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.