బీజేపీ జిల్లాల అధ్యక్షులతో బండి సంజయ్ భేటీ
ABN , First Publish Date - 2022-03-20T18:23:45+05:30 IST
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల మినహా మిగిలిన జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ భేటీ హాట్ హాట్గా జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవలసిన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలియవచ్చింది. కొన్ని జిల్లాల అధ్యక్షుల వ్యవహారంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే దూకుడు పెంచాలన్నారు. గతంలో ఇచ్చిన కార్యాచరణ ఏ మేరకు అమలు చేశారన్న వివరాలను బండి సంజయ్ సేకరిస్తున్నట్లుగా తెలియవచ్చింది.