‘బుల్లిబాయ్’ కేసు.. సహ నిందితుడు విశాల్ కుమార్కు 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీ
ABN , First Publish Date - 2022-01-05T02:46:17+05:30 IST
‘బుల్లి బాయ్’ యాప్ కేసులో సహ నిందితుడైన 21 ఏళ్ల విశాల్ కుమార్కు కోర్టు ఈ నెల పదో తేదీ వరకు పోలీసు
బెంగళూరు: ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో సహ నిందితుడైన 21 ఏళ్ల విశాల్ కుమార్కు కోర్టు ఈ నెల పదో తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అలాగే, అతడి ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. కాగా, విశాల్ కుమార్ను ఈ రోజు (మంగళవారం) బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్ కోరనున్నారు. అది లభించగానే విచారణ కోసం ముంబై తీసుకొస్తారు. నిందితులిద్దరికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. బుల్లి బాయ్ యాప్కు సంబంధించి నిందితురాలు మూడు ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. సహ నిందితుడైన విశాల్ కుమార్ ఖల్సా సూపర్మిస్ట్ పేరుతో ఖాతా తెరిచినట్టు పోలీసులు వివరించారు.