బుల్లెట్ రైల్ కోసం ప్రధానికి విన్నవించా: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-09-03T22:40:21+05:30 IST

బుల్లెట్ రైల్ కోసం ప్రధానికి విన్నవించా: ఉత్తమ్

బుల్లెట్ రైల్ కోసం ప్రధానికి విన్నవించా: ఉత్తమ్

సూర్యాపేట: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేసే హైదరాబాద్ -విజయవాడ బుల్లెట్ రైల్ సౌకర్యం కల్పించాలని ప్రధానికి విన్నవించానని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితబంధు పథకం దళితులను మోసం చేయడానికేనన్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు దళితులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి కేబినెట్లో 30 శాతం పదవులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. దళితులకు ఇప్పటివరకూ ఎన్ని పదవులు ఇచ్చారని ఉత్తమ్ ప్రశ్నించారు.  జనాభాలో 16 శాతం ఉన్న దళిత కుటుంబాలకు రూ.1.6 లక్షల కోట్ల నిధులను దళితబంధు కింద తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-03T22:40:21+05:30 IST