Temple: ఎద్దుకో ఆలయం!

ABN , First Publish Date - 2022-09-11T16:50:34+05:30 IST

హిందూ మతంలో వృషభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదేవుడు ఈశ్వరుడి వాహనంగా గుర్తింపు పొందింది. అంతే కాకుండా మానవులకు ఎద్దు

Temple: ఎద్దుకో ఆలయం!

                                             - రైతు అభిమానం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 10: హిందూ మతంలో వృషభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదేవుడు ఈశ్వరుడి వాహనంగా గుర్తింపు పొందింది. అంతే కాకుండా మానవులకు ఎద్దు రూపంలో కీలకంగా మారింది. తిరుప్పూర్‌(Tiruppur) జిల్లా సేనాపతిపాళయానికి చెందిన రైతు సోమసుందరం(Somasundaram) 18 సంవత్సరాలు ఎద్దును పోషిస్తున్నాడు. కుటుంబంలో ఓ సభ్యుడిగా ఆయన అభిమానించాడు. వృద్ధాప్యం కారణంగా 10, సెప్టెంబరు 2018లో అది మృతి చెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ఎద్దును తన పొలంలోనే అంత్యక్రియలు చేసి అక్కడ ఓ ఆలయాన్ని నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇప్పటికే చిత్రపటం ఏర్పాటు చేసి ప్రతిఏటా ఎద్దు వర్ధంతి నిర్వహించి పొంగళ్లు పెట్టి నైవేధ్యాన్ని పెడుతున్నాడు. ఆలయ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోమసుందరం తెలిపాడు.

Updated Date - 2022-09-11T16:50:34+05:30 IST