బల్కంపేట ఎల్లమ్మకు భక్తుడు

ABN , First Publish Date - 2021-12-05T09:36:58+05:30 IST

రోశయ్య హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి పరమ భక్తుడు. తరచూ భార్యతో కలిసి దేవాలయానికి వచ్చేవారు.

బల్కంపేట ఎల్లమ్మకు భక్తుడు

రోశయ్య హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి పరమ భక్తుడు. తరచూ భార్యతో కలిసి దేవాలయానికి వచ్చేవారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా సేవలందించిన సమయంలో కూడా అనేక సందర్భాల్లో ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. రూ.18 లక్షల సొంత డబ్బులో  ఊరేగింపు రథం బహూకరించారు. అంతరాలయం ఫ్లోరింగ్‌, డోనర్‌ కాంప్లెక్స్‌లో ఫ్లోరింగ్‌, విద్యుద్దీపాలంకరణ, కళ్యాణ మండపంలో ఫ్లోరింగ్‌ స్వయంగా చేయించారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్యవైశ్య సంఘాలు, సత్రాలు, ఆలయాలను ప్రారంభించారు.

Updated Date - 2021-12-05T09:36:58+05:30 IST