మార్చి నాటికి భవనాలు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T06:14:02+05:30 IST

ఎన్నార్జీఎస్‌ ద్వారా చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు మార్చినాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.కొండయ్య తెలిపారు.

మార్చి నాటికి భవనాలు పూర్తి చేయాలి
సచివాలయాన్ని పరిశీలిస్తున్న పంచాయతీ రాజ్‌ ఎ్‌సఈ


తాళ్లూరు, డిసెంబరు 2: ఎన్నార్జీఎస్‌ ద్వారా చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు మార్చినాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.కొండయ్య తెలిపారు. మండలంలోని తాళ్లూరు, దోసకాయలపాడు గ్రామాల్లో పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సచివాలయ భవననిర్మాణాలను,  రైతు భరోసా కేంద్రాలను, దోసకాయలపాడు-తోటవెంగన్నపాలెం నడుమపూర్తిగా దెబ్బతిన్న దోర్నపువాగు కల్వర్ట్‌ను పరిశీలించారు.    వాగుపై చప్టానిర్మాణానికి ఎంతమేర నిధులుఅవసరమో అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ విఠల్‌రాథోడ్‌, ఏఈ ఆర్‌.వి.సుబ్బయ్య, మాజీ జడ్పీటీసీలు మారం వెంకటరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు ఐ.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామసచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:14:02+05:30 IST