పయ్యావుల కేశవ్ ఆరోపణలపై స్పందించిన మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2021-07-23T02:24:11+05:30 IST

పయ్యావుల కేశవ్ ఆరోపణలపై స్పందించిన మంత్రి బుగ్గన

పయ్యావుల కేశవ్ ఆరోపణలపై స్పందించిన మంత్రి బుగ్గన

ఢిల్లీ: ఏపీపీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలపై స్పందించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన అప్పులు గుట్టుగా చేయలేదన్నారు. పీఏసీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నట్లు ఉందని పేర్కొన్నారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నట్లు తెలిపారు. జీవోల ప్రకారమే లోన్‌ తీసుకున్నామని, గుట్టుగా ఏం తీసుకోలేదన్నారు. మద్యంపై వచ్చే పన్నును అప్పులు కట్టడానికి కేటాయించామని మంత్రి చెప్పారు. అప్పు కోసం కేంద్రం, ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ హయాంలో వేల కోట్లు అప్పులు చేశారని, అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-07-23T02:24:11+05:30 IST