వెల్లంపల్లిపై మండిపడ్డ బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2022-01-02T23:29:25+05:30 IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లంపల్లి సొంత డివిజన్‌లో టీడీపీ

వెల్లంపల్లిపై మండిపడ్డ బుద్దా వెంకన్న

విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లంపల్లి సొంత డివిజన్‌లో టీడీపీ జెండా ఎగురవేశామని తెలిపారు. టీడీపీ నుంచి గెలిచిన చంటిపై వెల్లంపల్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అధికారిక కార్యక్రమానికి పిలవలేదని అడిగితే దూషిస్తారా అని మండిపడ్డారు. ‘‘వెల్లంపల్లికి ఇదే మా సవాల్. కార్పొరేటర్ చంటితో నేరుగా పోరాడు. చంటి గెలిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మీరు గెలిస్తే.. చంటి మీ కాళ్లు మొక్కుతాడు. పోలీసులను అడ్డుపెట్టుకుని నోరు పారేసుకోవడం సరికాదు’’ అని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.

Updated Date - 2022-01-02T23:29:25+05:30 IST