పారాసిట్మాల్ వేసుకోమన్నందునే 3వ దశకు చేరింది: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-04-10T17:45:18+05:30 IST

అమరావతి: కరోనా నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

పారాసిట్మాల్ వేసుకోమన్నందునే 3వ దశకు చేరింది: బుద్దా వెంకన్న

అమరావతి: కరోనా నివారణకు దేశం మొత్తం ముందే మేల్కొందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం బ్లీచింగ్ చల్లుకుని పారాసిట్మాల్ వేసుకోమని సెలవిచ్చినందునే వైరస్ 3దశకు చేరిందని విమర్శించారు. పరిపాలన చేతకాదన్నది రాష్ట్ర ప్రజలకు జగన్ చర్యలతో తేటతెల్లమైందన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను వైసీపీ ప్రజాప్రతినిధులు ఉల్లంఘిస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. మంత్రి సురేష్‌తో పాటు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు లాక్‌డౌన్‌ని ఉల్లంఘిస్తే వారిని ఎందుకు క్వారంటైన్‌లో పెట్టలేదని ప్రశ్నించారు.


రాష్ట్రం మంచి కోసం ఈ సూచనలు పాటించండని చంద్రబాబు లేఖలు రాస్తుంటే దానినీ వైసీపీ నేతలు తప్పుబట్టడం దురదృష్టకరమని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలతో పేదలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే అందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. సంక్షోభ సమయంలోనూ సాక్షి పత్రికకు జగన్ కోట్లాది రూపాయల ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.

Updated Date - 2020-04-10T17:45:18+05:30 IST