బడ్జెట్‌పై సీఎం తుది మెరుగులు

ABN , First Publish Date - 2022-02-27T18:15:47+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు గడువు సమీపిస్తున్న తరుణంలో తుదిమెరుగులు దిద్దేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సిద్ధమయ్యారు. శనివారం చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య (కాసియా) ప్రతినిధులతో ప్రత్యేక

బడ్జెట్‌పై సీఎం తుది మెరుగులు

బెంగళూరు: రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు గడువు సమీపిస్తున్న తరుణంలో తుదిమెరుగులు దిద్దేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సిద్ధమయ్యారు. శనివారం చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య (కాసియా) ప్రతినిధులతో ప్రత్యేక సమావేశమయ్యారు. బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈ, స్టార్ట్‌పలకు 4 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలని, తద్వారా పరిశ్రమల ప్రగతికి ప్రయోజనకరమని వివరించారు. పలుశాఖల అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరో మూడు రోజులు మాత్రమే బడ్జెట్‌ సమావే శాలకు గడువు ఉండడంతో సీఎం ఉదయం నుంచి సాయంత్రందాకా బిజీగా గడిపారు. 

Updated Date - 2022-02-27T18:15:47+05:30 IST