రేపు అనకాపల్లికి లోకేశ్
ABN , First Publish Date - 2021-10-19T08:09:46+05:30 IST
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 20న అనకాపల్లి వస్తున్నారని ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ
పర్యటనను అడ్డుకోవాలని చూస్తే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తాం: బుద్దా
విశాఖపట్నం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 20న అనకాపల్లి వస్తున్నారని ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న తెలిపారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేశ్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని వెంకన్న హెచ్చరించారు.