Ambati Rambabuకు బుద్ధా వెంకన్న కౌంటర్
ABN , First Publish Date - 2022-05-21T00:00:50+05:30 IST
ఏ నదిపై ఏ ప్రాజెక్ట్ కడతారో తెలియని బడుద్దాయి.. బడాయి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు.
అమరావతి: మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ నదిపై ఏ ప్రాజెక్ట్ కడతారో తెలియని బడుద్దాయి.. బడాయి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు. పోలవరంలో టీడీపీ ప్రభుత్వ తప్పుంటే మూడేళ్లలో జగన్ ఏం పీకారు? అని ప్రశ్నించారు. మూడేళ్లలో ఒక్క పిల్ల కాలువ కూడా కట్టలేదన్నారు. మాజీ సీఎం వైఎస్ చనిపోగానే సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేత సోనియా కాళ్లపై జగన్ పడ్డారని, ఎవరో పెట్టుకున్న పార్టీని కబ్జా చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీ కాళ్లపై పడ్డారని ఆరోపించారు. తల్లి, చెల్లిని రాజకీయంగా వాడుకుని వదిలేశారని బుద్దా వెంకన్న తప్పుబట్టారు.