మంత్రి సురేష్ను ఎందుకు క్వారంటైన్లో పెట్టలేదు?: బుద్దా
ABN , First Publish Date - 2020-04-10T22:51:46+05:30 IST
హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ను..
విజయవాడ: హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ను క్వారంటైన్లో ఎందుకు ఉంచలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించడం మంచిదేనని.. అయితే అవి ప్రజలకే పరిమితం అవుతున్నాయని, వైసీపీ నాయకులు పాటించడంలేదని విమర్శించారు. తూర్పుగోదావరికి చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వచ్చారన్నారు. ప్రజలకొకన్యాయం, వైసీపీ నేతలకొకన్యాయమా? అని ప్రశ్నించారు. 9 నెలల గర్భిణిని 14 రోజులు క్వారంటైన్లో ఉంచారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సురేష్ ఆంక్షలు పాటించడంలేదు గానీ, చంద్రబాబుకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కరోనా జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు