తల్లిదండ్రులు మందలించారని బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-16T15:09:09+05:30 IST

విజయవాడ: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

తల్లిదండ్రులు మందలించారని బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

విజయవాడ: ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పెద్ద అవుటపల్లికి చెందిన పలగాని రమేష్ విజయవాడలో  వీఆర్  సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రమేష్ తన స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్ రాత్రి 10 గంల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడికి ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టాడు.


అనుమానం వచ్చిన స్నేహితుడు.. రమేష్ తల్లిదండ్రులుకి చెప్పాడు. వెంటనే కుమారుడి కోసం రమేష్ తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై వాసిరెడ్డి బృందం కేసరపల్లి కాలువ వద్ద రమేష్‌ బైక్‌ని గుర్తించారు. బైక్‌లో తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టినట్లు గుర్తించారు. రమేష్ కోసం కేసరపల్లి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-07-16T15:09:09+05:30 IST