ఆర్టీసీ బస్సులో బీటెక్‌ విద్యార్థి మృతి కలకలం

ABN , First Publish Date - 2021-07-28T06:49:50+05:30 IST

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అనుమాన్పాద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

ఆర్టీసీ బస్సులో బీటెక్‌ విద్యార్థి మృతి కలకలం
మృతి చెందిన కేశవయ్య

అనంతపురం క్రైం, జూలై 27 : నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి అనుమాన్పాద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. త్రీటౌన్‌ పోలీ సులు తెలిపిన మేరకు..పామి డి మండలం పామిడి కొండా పురం గ్రామానికి చెం దిన కేశవయ్య(26) విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఇం జనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం ఉండ టంతో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులో అనంతపురం బయల్దేరాడు. మంగళవారం ఉద యం 7.30 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్గో పార్శిల్‌ వద్దకు బస్సు చేరుకుంది. ప్రయాణికులందరూ  దిగిపోయారు.  కేశవయ్య మాత్రం తన సీటులోనే స్థిమితం లేకుండా పడి ఉండటంతో గమనించిన బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌లు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. స్పృహ లేకుండా ఉండటంతో అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా సోదరుడికి ఫోన్‌ చేసి విషయం తెలిపారు. సోదరుడితో పాటు త్రీటౌన్‌ పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని కేశవయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. అనారోగ్యంతో ఉండటంతోనే మృతి చెంది ఉంటాడని మృతుడి సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. 


Updated Date - 2021-07-28T06:49:50+05:30 IST