వైఎస్ వివేకా హత్యకేసు.. వైసీపీ నేతలకు బిటెక్ రవి సవాల్

ABN , First Publish Date - 2022-01-18T16:59:29+05:30 IST

వైఎస్ వివేకా హత్యకేసులో వైసీసీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి సవాల్ విసిరారు.

వైఎస్ వివేకా హత్యకేసు.. వైసీపీ నేతలకు బిటెక్ రవి సవాల్

కడప: వైఎస్ వివేకా హత్యకేసులో వైసీసీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి సవాల్ విసిరారు. వైసీపీ శ్రేణులు తమపై చేస్తున్న ఆరోపణలు ఋజువు చేస్తే దేనికైనా సిద్ధమన్నారు. వైఎస్ వివేకా హత్యకేసుతో ఎంపి అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు సంబంధం లేదని.. ఏ దేవుళ్ళపై అయినా ప్రమాణం చేయగలరా? అని సవాల్ చేశారు. ‘‘ఇక పార్టీలు మారే విషయానికొస్తే.. వివేకా కుటుంబ సభ్యులు సీఎం జగన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి వివేకా హత్యకేసుపై ఒత్తిడి తెస్తే.. నేను అవినాష్ రెడ్డికి సపోర్టు చెయ్యకపోతే అవినాష్ బీజేపీలోకి వెళతాడని స్వయంగా జగన్ రెడ్డే అన్నారని’’ ఈ విషయం వివేకా కుటుంబ సబ్యులను అడిగితే చెబుతారన్నారు. వివేకా కేసులో ఎంపి అవినాష్ రెడ్డి జైలుకు వెళితే.. ఇక్కడ నాయకత్వ సమస్య వస్తుందని, మమ్మల్ని వైసీపీలోకి రమ్మని ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ అడుగుతున్నారని అన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి గురించి మాట్లాడే వైసీపీ నాయకులకు, జిల్లా ప్రజలకు శంకర్ రెడ్డి చరిత్ర గురించి తెలుసునని అన్నారు. వివేకా కేసులో తాము ఎలాంటి ప్రమాణానికైనా సిద్దమని, వైసీపీ నాయకులు సిద్దమేనా? అని బిటెక్ రవి సవాల్ చేశారు.

Updated Date - 2022-01-18T16:59:29+05:30 IST