బీఎస్‌పీ సుప్రెమో మాయావతికి మాతృ వియోగం

ABN , First Publish Date - 2021-11-13T23:26:02+05:30 IST

అత్యంత దు:ఖకరమైన వార్త. బీఎస్‌పీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి రమరతి కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. తల్లి అంత్యక్రియల నిమిత్తం కుమారి మాయావతి ఢిల్లీకి బయలుదేరారు..

బీఎస్‌పీ సుప్రెమో మాయావతికి మాతృ వియోగం

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించినట్లు ఆ పార్టీ శనివారం పేర్కొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం తుది శ్వాస విడిచినట్లు పార్టీ తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు 92 సంవత్సరాలు. గతేడాది నవంబర్ 19న మాయావతి తండ్రి ప్రభుదయాల్ మరణించారు. ఆయన మరణించి ఏడాది కూడా గడవకముందే రాంరతి మరణించారు.


ఈ విషయమై బీఎస్‌పీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘అత్యంత దు:ఖకరమైన వార్త. బీఎస్‌పీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి రాంరతి కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. తల్లి అంత్యక్రియల నిమిత్తం కుమారి మాయావతి ఢిల్లీకి బయలుదేరారు’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2021-11-13T23:26:02+05:30 IST