పార్లమెంటుకు హాజరైన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీకి కరోనా
ABN , First Publish Date - 2021-12-21T22:49:35+05:30 IST
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నిన్న కూడా ఆయన సభకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తనను కలిసిన ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ సూచించారు. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్లో ఉండాలని కోరారు.
కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నానని, అయినప్పటికీ తనకు కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా ఎంపీ వెల్లడించారు. నిన్న తాను పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరైనట్టు చెప్పారు. తనతో కాంటాక్ట్లోకి వచ్చిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు. తనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని డానిష్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు.