బీఎస్ఎన్ఎల్ నయా ఆఫర్.. రీచార్జ్ చేస్తే నాలుగు శాతం తక్షణ డిస్కౌంట్!
ABN , First Publish Date - 2020-07-05T01:45:12+05:30 IST
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4శాతం తక్షణ రాయితీ ప్రమోషనల్ ఆఫర్ను తిరిగి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ మై
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4శాతం తక్షణ రాయితీ ప్రమోషనల్ ఆఫర్ను తిరిగి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ మై బీఎస్ఎన్ఎల్ యాప్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఇతర ఖాతాదారుల ప్రీపెయిడ్ ఖాతాను ఈ యాప్ ద్వారా చేసినప్పుడు 4 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. సెప్టెంబరు 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ను తొలుత ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. మే 31తో ముగిసింది. అయితే ఈసారి మాత్రం మూడు నెలలపాటు అందుబాటులో ఉండనున్నట్టు కర్ణాటక బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అయితే, యూజర్ తన నంబరుకు రీచార్జ్ చేసుకుంటే మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. వేరే వారి మొబైల్ నంబర్లను రీచార్జ్ చేసినప్పుడు మాత్రమే 4శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా ఇలాంటి ఆఫర్ను ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా తక్షణ రాయితీ ఆఫర్ను తెరపైకి తీసుకొచ్చింది.