2జీ సేవలు ఆపే ప్రసక్తే లేదు : బీఎ్సఎన్ఎల్
ABN , First Publish Date - 2020-11-22T06:24:47+05:30 IST
2జీ టెలికాం సేవలు ఆపేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్సఎన్ఎల్ ఏమాత్రం సిద్ధంగా లేదు. ప్రభుత్వం నియమించిన ఒక సాంకేతిక కమిటీ బీఎ్సఎన్ఎల్ ఈ సేవలను నిలిపివేయాలని కోరింది...
న్యూఢిల్లీ: 2జీ టెలికాం సేవలు ఆపేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్సఎన్ఎల్ ఏమాత్రం సిద్ధంగా లేదు. ప్రభుత్వం నియమించిన ఒక సాంకేతిక కమిటీ బీఎ్సఎన్ఎల్ ఈ సేవలను నిలిపివేయాలని కోరింది. తద్వారా కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని సూచించింది. అయితే, బీఎ్సఎన్ఎల్ ఖాతాదారుల్లో 60 శాతం మంది 2జీ ఖాతాదారులే. ఉన్న పళంగా 2జీ సేవలు ఆపేస్తే మరిన్ని ఆర్థిక కష్టాల్లో పడతామని బీఎ్సఎన్ఎల్ భావిస్తోంది.