600 రోజుల దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
ABN , First Publish Date - 2020-05-26T00:12:29+05:30 IST
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.2,399తో దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.2,399తో దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది. చత్తీస్గఢ్ ట్విట్టర్ ఖాతా ద్వారా బీఎస్ఎన్ఎల్ ఈ ప్రకటన చేసింది. ఈ ప్లాన్ కాలపరిమితి 600 రోజులు. ఇందులో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. రోజుకు 250 నిమిషాల టాక్టైం లభిస్తుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్లో తొలి 60 రోజులు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఉచితంగా లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్లో రోజుకు 100 ఎస్సెమ్మెస్లు ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు కాబట్టి డేటా కోసం అదనంగా యాడ్ ఆన్ ప్యాక్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.