కేంద్ర బలగాలతో ప్రజలను భయపెడుతున్నారు : తృణమూల్

ABN , First Publish Date - 2021-01-21T22:17:30+05:30 IST

మున్సిపల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలతో సరిహద్దు ప్రాంత ప్రజలను కేంద్రం భయపెట్టిపోస్తోందని

కేంద్ర బలగాలతో ప్రజలను భయపెడుతున్నారు : తృణమూల్

కోల్‌కతా : మున్సిపల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలతో సరిహద్దు ప్రాంత ప్రజలను కేంద్రం భయపెట్టిపోస్తోందని మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. కేంద్ర బలగాలతో ప్రజలను భయపెడుతూ, తమకు ఓటేసెలా బీజేపీ యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి హకీమ్ నేతృత్వంలో తృణమూల్ నేతల బృందం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. భేటీ తర్వాత మంత్రి హకీమ్ మాట్లాడుతూ... ప్రజలను భయపెట్టి కేంద్ర బలగాలు బీజేపీకి ఓట్లు వేయించేలా వ్యూహం పన్నాయని, ఇదే విషయాన్ని తాము రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఈసీ స్పందిస్తూ... ఈ ఆరోపణలపై తప్పకుండా దృష్టి సారిస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను బీఎస్‌ఎఫ్ ఖండించింది. తమకు రాజకీయాలతో సంబంధం లేదని బీఎస్‌ఎఫ్ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-01-21T22:17:30+05:30 IST