మహిళా కానిస్టేబుల్ను చంపేసిన బీఎస్ఎఫ్ జవాను.. కారణమిదే!
ABN , First Publish Date - 2020-07-18T04:07:25+05:30 IST
దేశరాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ను ఓ బీఎస్ఎఫ్ జవాను హతమార్చాడు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ను ఓ బీఎస్ఎఫ్ జవాను హతమార్చాడు. బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి వివాహమైంది. అయినాసరే మరో మహిళా కానిస్టేబుల్తో సహజీవనం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆమె మరొకరితో ఎఫైర్ పెట్టుకుందని అతను అనుమానించాడు. ఈ విషయమై సహజీవనం చేస్తున్న ఇద్దరికీ పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ గొడవల కారణంగానే ఆమె బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.