BRS: దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ : సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-10-05T20:06:38+05:30 IST
దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం క్రీడలా మారిందని దుయ్యబట్టారు.
హైదరాబాద్: దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం క్రీడలా మారిందని దుయ్యబట్టారు. తనకు మాత్రం రాజకీయం ఒక టాస్క్ అని పేర్కొన్నారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ (BRS) పనిచేస్తుందని తెలిపారు. ఆహారభద్రత ఉన్న రాష్ట్రంలో ప్రాసెసింగ్ ఫుడ్పై ఆధారపడడం సిగ్గుచేటన్నారు. విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ దిగుమతి చేసుకోవడం దారుణమని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నిస్తామని కేసీఆర్ ప్రకటించారు.