న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం తీసుకొచ్చారు
ABN , First Publish Date - 2021-06-15T08:07:29+05:30 IST
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినవ అంబేడ్కర్ అని బీజేపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసించారు.
జస్టిస్ రమణకు మాజీ మంత్రి మోత్కుపల్లి ప్రశంస
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినవ అంబేడ్కర్ అని బీజేపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసించారు. సోమవారం రాజ్భవన్లో ఆయన జస్టిస్ రమణను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో కూడా సామాౄజిక న్యాయాన్ని తీసుకొచ్చిన ఘనత జస్టిస్ రమణదేనని అన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలౄహీన వర్గాల వారు హైకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉందన్నారు. కాగా, జస్టిస్ వెంకటరమణను మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాజ్భవన్లో కలిసి అభినందించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు.