హైదరాబాద్లో అన్నదమ్ముల అదృశ్యం
ABN , First Publish Date - 2020-05-03T14:38:12+05:30 IST
ఇంటి నుంచి బయటకు వెళ్లిన అన్నదమ్ములు అదృశ్యమయ్యారు.
హైదరాబాద్/సంతోష్నగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. సంతోష్నగర్ హస్నాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫారూఖ్ హాష్మి కుమారులు సయ్యద్ ఇస్మాయిల్ హాష్మి (15)సయ్యద్ అబ్దుల్లా హాష్మి(10) గత నెల 29న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేరకు తండ్రి సయ్యద్ ఫారూఖ్ హాష్మి సంతోష్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.