ప్రాణం తీసిన ప్రేమ వివాహం.. పరువు కోసం సొంత చెల్లినే ఆ సోదరుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-05T09:58:15+05:30 IST

వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో సొంత చెల్లినే ఒక అన్న కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూర్‌లో జరిగింది...

ప్రాణం తీసిన ప్రేమ వివాహం.. పరువు కోసం సొంత చెల్లినే ఆ సోదరుడు ఏం చేశాడంటే..

వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంతో సొంత చెల్లినే ఒక అన్న కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూర్‌లో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. కోమల్ అనే యువతి.. కరణ్ గోస్వామి అనే యువకుడిని ప్రేమించింది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోర్టుకెక్కారు. కోర్టు నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 20న ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని కోమల్ తల్లి కూడా అంగీకరించింది. అయితే కోమల్ సోదరుడు కరణ్ ఖటీక్‌కు నచ్చలేదు. అలాగే మేనమామ, వాళ్ల పిల్లలు సన్నీ, గౌరవ్ ధరమ్‌వీర్ కూడా ఈ పెళ్లిని అంగీకరించలేదు. వారి సామాజిక వర్గానికి చెందిన మరికొంత మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కరణ్, సన్నీ, గౌరవ్, ధరమ్‌వీర్ సహా మరికొందరు కలిసి కోమల్‌ను ఆమె భర్తను హతమార్చాలని అనుకున్నారు. 


ఏప్రిల్ 25నే వాళ్లను చంపాలని అనుకున్నా.. ఏవో అవాంతరాలు రావడంతో ఈ హత్యాకాండ జరగలేదు. అయితే మరుసటి రోజు కోమల్ దంపతులు నివశిస్తున్న ఇంటిపై దాడి చేసిన కరణ్, ఇతరులు ఇద్దరిపై భయంకరంగా దాడి చేశారు. ఈ దాడిలో కోమల్ మృతి చెందగా.. ఆమె భర్త గోస్వామి, అత్త పింకీ దేవి, అంకుల్ రాకీకి తీవ్రంగా గాయాలయ్యాయి. 


విషయం తెలుసుకున్న పోలీసులు కరణ్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే వాళ్లను కూడా పట్టుకొని జైలుకు పంపుతామని హామీ ఇచ్చారు.

Read more