పగిలిన మిషన్ భగీరథ పైపులైన్.. జలమయమైన రోడ్డు
ABN , First Publish Date - 2021-12-03T07:05:15+05:30 IST
ఖానాపూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలిపోవటంతో రహదారి జల మయం అయింది.
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 2 : ఖానాపూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలిపోవటంతో రహదారి జల మయం అయింది. ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ పైపు లైన్ నుండి నీళ్లు లీకు అవుతున్నాయి. దీంతో రహదారి మొత్తం జల మయం అయింది. పెద్దనీటి గంత ఏర్పడింది. వాహనాలు వెలుతున్న సమ యంలో గుంతలో ఉన్న నీళ్లు ఇతరులపైన పడుతున్నాయని పలువురు వా పోయారు. ఈ ప్రాంతంలో కూరగాయల మార్కెట్, ఇతర చిన్న వ్యాపారులు చేసుకునే వారు, వివిద దుకాణాలు, అటోలు ఆగటం నిత్యం వచ్చిపోయే వారితో బిజీగా ఉంటుంది. వెంటనే అధికారులు మరమత్తులు చేయక పోవటంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గతంలో అనేక సార్లు ఈ పైపులైన్ పగిలిపోతే అధికారులు తాత్కాలిక మరమత్తులు చేసి వదిలేసారు. కాని సమస్య మాత్రం పరిష్కారం చేయలేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చేసి, లీకేజీ కాకుండా చూడాలని కోరుతున్నారు.