ప్రధాన మంత్రికి కూతురు పుట్టింది
ABN , First Publish Date - 2021-12-09T23:44:51+05:30 IST
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు గురువారం
లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు గురువారం ఓ కుమార్తె జన్మించింది. ఆయన తరపున విడుదలైన అధికారిక ప్రకటనలో బోరిస్ జాన్సన్ సతీమణి కేరీ జాన్సన్ (33) గురువారం ఓ బిడ్డకు జన్మనిచ్చారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అత్యంత జాగ్రత్తగా చూసుకుని, సహకరించిన వైద్య బృందానికి దంపతులిద్దరూ ధన్యవాదాలు తెలిపారని పేర్కొన్నారు.
బోరిస్ జాన్సన్ వయసు 57 సంవత్సరాలు. గురువారం జన్మించిన కుమార్తె ఆయనకు ఏడో సంతానం. గత ఏడాది బోరిస్-కేరీ దంపతులకు ఓ బిడ్డ జన్మించింది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది మే నెలలో జరగడం మరో విశేషం. ఇది ఆయనకు మూడో వివాహం. భారత సంతతి మహిళ మెరీనా వీలర్కు విడాకులు ఇచ్చిన తర్వాత కేరీను పెళ్లి చేసుకున్నారు. బోరిస్-మెరీనాలకు నలుగురు పిల్లలు జన్మించారు. తొలి భార్య వల్ల ఆయనకు సంతానం లేదు. ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మెసింటైర్తో అపైర్ ద్వారా మరో బిడ్డకు 2009లో జన్మనిచ్చారు.