ఆంక్షలు సడలించిన బ్రిటన్‌

ABN , First Publish Date - 2021-08-09T13:41:09+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం సడలించింది. ఇందులో భాగంగా వారిని ‘రెడ్‌’ జాబితా నుంచి ‘యాంబర్‌’ జాబితాలోకి చేర్చింది. దీంతో టీకా తీసుకున్న భారత ప్రయాణికులు .. ఇకపై బ్రిటన్‌కు వెళ్లగానే 10 రోజుల పాటు హోటల్‌..

ఆంక్షలు సడలించిన బ్రిటన్‌

లండన్‌, ఆగస్టు 8  : కొవిడ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం సడలించింది. ఇందులో భాగంగా వారిని ‘రెడ్‌’ జాబితా నుంచి ‘యాంబర్‌’ జాబితాలోకి చేర్చింది. దీంతో టీకా తీసుకున్న భారత ప్రయాణికులు .. ఇకపై బ్రిటన్‌కు వెళ్లగానే 10 రోజుల పాటు హోటల్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. దీనికి బదులు వారు తమ ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండొచ్చని నిర్దేశించింది. అయితే భారత్‌ నుంచి ప్రయాణం ప్రారంభించడానికి మూడు రోజుల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్ష నివేదికను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. బ్రిటన్‌కు వచ్చిన ఐదో రోజున నిర్బంధంగా నిర్వహించే కొవిడ్‌ టెస్టులో నెగెటివ్‌ ఫలితం రాగానే క్వారంటైన్‌ను ముగించవచ్చని పేర్కొంది. భారత్‌తో పాటు బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏఈ దేశాల ప్రయాణికులకు కూడా ఈ సడలింపును ప్రకటించింది. 


Updated Date - 2021-08-09T13:41:09+05:30 IST