ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత.. రంగంలోకి సైన్యం..!

ABN , First Publish Date - 2022-01-08T04:05:33+05:30 IST

కరోనా దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఒమైక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో రోగుల తాకిడి తట్టుకోలేక ఆస్పత్రి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు సిబ్బంది కొరత కూడా తీవ్రమవుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.

ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత.. రంగంలోకి సైన్యం..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు బ్రిటన్ విలవిల్లాడుతోంది. ఒమైక్రాన్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో రోగుల తాకిడి తట్టుకోలేక ఆస్పత్రి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. మరోవైపు సిబ్బంది కొరత కూడా తీవ్రమవుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. తొలి విడతలో మొత్తం 200 మంది ఆర్మీ సిబ్బంది వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందించనున్నారు. కాగా.. బ్రిటన్‌లో గత వారం సగటున రోజుకు 1.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. ప్రజల్లో అధికశాతం మంది కరోనా టీకాలు తీసుకుని ఉండటంతో ఒమైక్రాన్ ముప్పును బ్రిటన్ దీటుగానే ఎదుర్కొంటుందని ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. అయితే.. సిబ్బంది కొరత కారణంగా కొన్ని సవాళ్లు తప్పవని కూడా ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-08T04:05:33+05:30 IST