అందుకే నాలుగో టెస్టుకు దూరం.. ఆసక్తికర విషయం వెల్లడించిన అశ్విన్
ABN , First Publish Date - 2021-01-26T05:38:43+05:30 IST
భారత క్రికెట్ జట్టు ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తాను నాలుగో టెస్టుకు దూరం అవడానికి బ్రిస్బేన్లో విధించిన నిబంధనలే కారణమని షాకింగ్ విషయం వెల్లడించాడు. తమ జట్టును పూల్ వద్దకు వెళ్లనివ్వలేదని, గాయాల నుంచి కోలుకునే సమయంలో పూల్
చెన్నై: భారత క్రికెట్ జట్టు ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తాను నాలుగో టెస్టుకు దూరం అవడానికి బ్రిస్బేన్లో విధించిన నిబంధనలే కారణమని షాకింగ్ విషయం వెల్లడించాడు. తమ జట్టును పూల్ వద్దకు వెళ్లనివ్వలేదని, గాయాల నుంచి కోలుకునే సమయంలో పూల్ చాలా ముఖ్యమైన సాధనమని అశ్విన్ చెప్పాడు. ఈ కారణంగానే తాను నాలుగో టెస్టుకు ఫిట్నెస్ సాధించలేక పోయినట్లు అతను చెప్పాడు. తమ జట్టు ఫిజియో కూడా.. గాయాల నుంచి కోలుకునే ప్రక్రియ మొదలైతే.. నాలుగో టెస్టు ఆడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని తనకు చెప్పినట్లు అశ్విన్ వెల్లడించాడు. కానీ పూల్ వంటి సదుపాయాలకు దూరంగా ఉండటంతో తాను ఫిట్నెస్ సాధించలేక పోయానని చెప్పాడు.