జాతీయ హోదా తెండి: కవిత
ABN , First Publish Date - 2022-01-25T07:48:52+05:30 IST
: మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ బండి సంజయ్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. స్వరాష్ట్రంలో నాలుగుసార్లు జరిగిన జాతర నిర్వహణకు సీఎం రూ. 332.71కోట్లు విడుదల చేశారన్నారు. 2014 నుంచి కేంద్రం ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10ు రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.