రూ.60కోట్లతో స్వర్ణముఖి నదిపై ఆనకట్ట
ABN , First Publish Date - 2020-11-25T05:57:06+05:30 IST
శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖి నదిపై రూ.60కోట్లతో ఆనకట్ట నిర్మాణానికి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు ప్రతిపాదనలు పంపినట్లు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీరు పుల్లారావు తెలిపారు.
- సీఈ పుల్లారావు
శ్రీకాళహస్తి, నవంబరు 24: శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖి నదిపై రూ.60కోట్లతో ఆనకట్ట నిర్మాణానికి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు ప్రతిపాదనలు పంపినట్లు నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీరు పుల్లారావు తెలిపారు. ప్రస్తుతమున్న ఆనకట్టతో కొంతమేర మాత్రమే నీరు నిల్వ చేరుతోందన్నారు. ఇక్కడ ఆనకట్ట ఎత్తు పెంచి నిర్మించడంతో స్వరముఖి నదిలో సుమారు 1.5కి.మీ. దూరం మేర నీరు నిల్వ ఉంటుందన్నారు. ముక్కంటి భక్తుల కోసం బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నది ఒడ్డున సుందరీకరణ పనులు పూర్తి చేసి.. అహ్లాదకర వాతావరణం ఉండేలా చూస్తామన్నారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ డిప్యూటీ సీఈ శివప్రసాద్, శ్రీకాళహస్తి ఈఈ మదనగోపాల్, ఇంజనీర్లు సుధాకర, ఆదినారాయణ తదితరులు ఉన్నారు.