మరమ్మతుల నిమిత్తం గౌతమి బ్రిడ్జి మూసివేత
ABN , First Publish Date - 2021-12-06T04:44:44+05:30 IST
రావులపాలెం గౌతమి పాత వంతెన మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో జాతీయరహదారి అధికారులు తాత్కాలికంగా బ్రిడ్జిని మూసివేశారు.
రావులపాలెం
రూరల్, డిసెంబరు 5: రావులపాలెం గౌతమి పాత వంతెన మరమ్మతులు చేయనున్న
నేపథ్యంలో జాతీయరహదారి అధికారులు తాత్కాలికంగా బ్రిడ్జిని మూసివేశారు.
స్థానిక ప్రభుత్వ కళాశాలల వద్ద నుంచి గౌతమి కొత్త వంతెనపైనే వాహనాలు
రాకపోకలు సాగించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. వంతెనను దృఢపరిచి
మరమ్మతులు చేయు నిమిత్తం మూడునెలలపాటు వంతెనను మూసివేస్తున్నట్టు అధికారులు
తెలిపారు.