రూ.10 నోటుపై ఓ యువతి రాసింది చదివి షాక్.. ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్.. ఇంతకీ ఆమె ఏం రాసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-21T09:22:14+05:30 IST

ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ నోట్లపై ఎలాంటి రాతలు రాయకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా వాటిని చాలామంది పట్టించుకోవడం లేదు. పైగా నిండా ప్రేమలో మునిగిన ప్రేమికులకైతే అసలు ఇవేమీ పట్టవు. తాజాగా ట్విట్టర్‌లో ఒక వ్యక్తి ఒక పది రూపాయల కరెన్సీ నోటుని ఫొటో తీసి పెట్టాడు...

రూ.10 నోటుపై ఓ యువతి రాసింది చదివి షాక్.. ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్.. ఇంతకీ ఆమె ఏం రాసిందో తెలిస్తే..

ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ నోట్లపై ఎలాంటి రాతలు రాయకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా వాటిని చాలామంది పట్టించుకోవడం లేదు. ఇక నిండా ప్రేమలో మునిగిన  ప్రేమికులకైతే వీటిని అసలు పట్టించుకోరు. తాజాగా ట్విట్టర్‌లో ఓ వ్యక్తి పది రూపాయల కరెన్సీ నోటుని ఫొటో తీసి పెట్టాడు. ఆ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ నోటుపై యువతి తన ప్రియుడికి ప్రేమ సందేశం రాయడం విశేషం.


వివరాల్లోకి వెళితే.. కుసుమ్ అనే యువతి విశాల్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెను మరో వ్యక్తితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం తన ప్రియుడికి చెప్పాలని ఆమె పది రూపాయల కరెన్సీ నోటుపై ఒక సందేశం రాసింది. ఆ నోటుపై "విశాల్, నాకు ఏప్రిల్ 26న పెళ్లి నిశ్చయించారు. నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లు. ఐ లవ్ యూ" అని రాసి ఉంది. కానీ ఆ కరెన్సీ నోటు ఒక ట్విట్టర్ ఖాతాదారుడికి చేతికి చిక్కింది. అది చూసిన అతను ఆ నోటుని ఫొటో తీసి ట్వీట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు.


ఈ ఫొటో చూసిన వారందరూ కుసుమ్, విశాల్‌ని కలిపేందుకు సహాయం చేయండి. ఇద్దరు నిజమైన ప్రేమికులను కలిపేందుకు ట్విట్టర్ సత్తా ఏంటో చూపిద్దాం అని తన పోస్ట్‌లో రాశాడు. ఆ పోస్ట్ చదివిన నెటిజెన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


విశాల్ పూర్తిపేరు తెలుసుకుంటే మంచిది కదా.. అని ఒక వ్యక్తి రాస్తే. పెళ్లిరోజున విశాల్ పేరు కలవారు కనీసం పది మంది అయినా అమె కోసం వస్తారు.. అని మరొకరు రాశారు. మొత్తానికి ఈ పోస్టు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.




Updated Date - 2022-04-21T09:22:14+05:30 IST