పెళ్లయిన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. వరుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-09-03T13:45:43+05:30 IST

పెళ్లయిన 20 రోజులకే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వరుడు అరెస్టయ్యాడు.

పెళ్లయిన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. వరుడి అరెస్టు

చెన్నై/వేలూరు : పెళ్లయిన 20 రోజులకే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వరుడు అరెస్టయ్యాడు. వివరాలిలా వున్నాయి... స్థానిక జీఆర్‌ పాళ్యంకు చెందిన మహాదేవమందిరి కుమార్తె చంద్రలేఖ (24)కు కాట్పాడి సమీపం బ్రహ్మపురంకు చెందిన బాలాజీ (34)తో గత నెల 23న వివాహం జరిగింది. మూడ్రోజులు క్రితం భార్యాభర్తలు జీఆర్‌ పాళ్యంకు వచ్చారు. మంగళవారం ఉదయం చంద్రలేఖ ఇంటి మేడపై ఉన్న గదిలో ఒంటిరిగా ఉండగా, కుటుంబసభ్యులు కింది అంతస్తులో మాట్లాడుకుం టున్నారు. ఆ సమయంలో మేడపై గది నుంచి పెద్దగా కేకలు వినిపించ డంతో భర్త బాలాజీతో పాటు కుటుంబసభ్యులు మేడపైకి చేరుకొని బాత్రూమ్‌ నుండి పొగలు రావడాన్ని గమనించారు.


తలుపులు బద్దలు కొట్టగా, మంటల్లో చిక్కుకున్న చంద్రలేఖ కనిపించింది. వెంటనే ఆమెను అడుక్కుమ్‌పారై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని చంద్రలేఖ వద్ద మరణ వాంగ్మూలం నమోదు చేశారు. చికిత్సలు ఫలించక ఆమె రాత్రి మృతిచెందింది. ఈ వ్యవహారంపై వేలూరు సబ్‌ కలెక్టర్‌ గణేష్‌ విచారణ జరుపగా, చంద్రలేఖ తల్లిదండ్రులు ఆమె రాసిన ఉత్తరాన్ని ఆయనకు ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలాజీని అరెస్టు చేసి విచారిస్తున్నారు.


పెళ్లైన మరుసటి రోజే...

పెళ్తైన మరుసటి రోజే వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదానికి దారితీసింది. విరుదునగర్‌ జిల్లా పాండియన్‌నగర్‌కు చెందిన శ్రీనివాసన్‌ కుమార్తె శ్వేత (20)తో శివగంగ జిల్లా మానామదురై అళగాపురినగర్‌కు చెందిన రామచంద్రన్‌ కుమారుడు సెల్వకుమార్‌ (27)కు గత సోమవారం మురుగన్‌ ఆలయంలో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో, వివాహమైన మరుసటిరోజే శ్వేత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మానామదురై పోలీసులు కేసు నమోదుచేయగా, నవ వధువు కావడంతో ఆర్డీఓ విచారణ చేపట్టారు.

Updated Date - 2020-09-03T13:45:43+05:30 IST