నేను రానంటే రాను.. పెళ్లి పీటలపై కూర్చోను.. పట్టుబట్టిన వధువు.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-08-25T15:01:38+05:30 IST

సాధారణంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక పెళ్లి. దీన్ని ఎప్పటికీ గుర్తుండే మధుర జ్ఞాపకంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు.

నేను రానంటే రాను.. పెళ్లి పీటలపై కూర్చోను.. పట్టుబట్టిన వధువు.. కారణమేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక పెళ్లి. దీన్ని ఎప్పటికీ గుర్తుండే మధుర జ్ఞాపకంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు కూడా. కానీ ఒక్కోసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. ఇదిగో ఈ పెళ్లి కూతురికి కూడా అలాగే జరిగింది. అయితే ఈ అమ్మాయి మాత్రం పట్టుపట్టింది. తాను అనుకున్నది జరిగితేనే పెళ్లి పీటలు ఎక్కుతానని స్పష్టం చేసేసింది. మండపంలోకి కూడా రాకుండా ఆగిపోయింది. ఇంతకీ ఆమెకు ఇంత కోపం రావడానికి కారణమేంటో తెలుసా? ఒక పాట.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. బంధువులందరితో కలిసి మండపంలోకి వస్తున్న పెళ్లి కూతురు సడెన్‌గా ఆగిపోయింది. తన ఎంట్రీ సమయంలో తాను కోరిన పాట రావడం లేదని, ఆ పాట వచ్చే వరకూ తాను మండపంలోకి రాబోనని తేల్చేసింది. ఆ పాట కోసం ఎమోషనల్‌ అయిపోయి ఏడ్చేసింది కూడా. మండపంలోకి తన ఎంట్రీ సమయంలో ఏ పాట కావాలో ఆ వధువు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుందట. అయితే ఆమె వచ్చేటప్పుడు ఆ పాట రాలేదు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ అమ్మాయి.. మండపంలోకి రావడానికి నిరాకరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఆ పెళ్లి కూతురికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెను ‘డ్రామా క్వీన్’ అంటూ విమర్శిస్తున్నారు. ఇదంతా కావాలనే చేసినట్లు కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి సమయంలో ఈ మాత్రం రగడ జరగకపోతే బాగోదని, ఇవే ఆ తర్వాత మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని కొందరు అంటున్నారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2021-08-25T15:01:38+05:30 IST