మార్చి 22న పెళ్లి.. ఇంతలోనే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. విషయం తెలిసి వరుడి రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-21T21:36:15+05:30 IST

ఆ యువకుడికి మంగళవారం అర్ధరాత్రి పెళ్లి.. ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి..

మార్చి 22న పెళ్లి.. ఇంతలోనే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. విషయం తెలిసి వరుడి రియాక్షన్ ఏంటంటే..

ఆ యువకుడికి మంగళవారం అర్ధరాత్రి పెళ్లి.. ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.. పెళ్లి మండపానికి వెళ్లడానికి అందరూ సిద్ధమవుతున్నారు.. బంధువులందరూ పెళ్లి వాహనంలో కూర్చున్నారు.. వరుడు కారులో కూర్చున్నాడు.. ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ వచ్చింది.. వధువు తన ప్రియుడితో వెళ్లిపోయిందని, పెళ్లి రద్దయిందని చెప్పారు.. షాకైన యువకుడు ఇంట్లోని నిద్ర మాత్రలు మింగేశాడు.


ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ అనే యువకుడికి కత్‌గోరా గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 22న పెళ్లి ఫిక్సయింది. సంజయ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెళ్లి కోసం కళ్యాణ మండపానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తరుణంలో వధువు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి బాంబ్ పేల్చారు. వధువు తన ప్రియుడితో పారిపోయిందని, పెళ్లి క్యాన్సిల్ అయందని చెప్పారు. దీంతో సంజయ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇంట్లోకి వెళ్లి 17 నిద్రమాత్రలు మింగేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని పెళ్లి కారులోనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అతడిని కాపాడారు.  


Updated Date - 2022-03-21T21:36:15+05:30 IST