వరుడు చేసిన పనికి.. పెళ్లిపీటల మీదనుంచి వెళ్లిపోయిన వధువు.. ఏమైందా అని ఆరా తీస్తే...!

ABN , First Publish Date - 2021-12-12T18:54:23+05:30 IST

వరుడు చేసిన పనికి.. పెళ్లిపీటల మీదనుంచి వెళ్లిపోయిన వధువు.. ఏమైందా అని ఆరా తీస్తే...!

వరుడు చేసిన పనికి.. పెళ్లిపీటల మీదనుంచి వెళ్లిపోయిన వధువు.. ఏమైందా అని ఆరా తీస్తే...!

చెన్నై/పెరంబూర్‌ : ముహూర్త సమయంలో వరుడు మద్యం మత్తులో ఉండడంతో వధువు పెళ్లిపీటల మీదనుంచి వెళ్లిపోయింది. ధర్మపురి జిల్లా తోట్టపడకండఅల్లి గ్రామానికి చెందిన శరవణన్‌ (32)కు తిరువణ్ణామలైకి చెందిన 22 ఏళ్ల యువతితో వివాహం నిశ్చయమైంది. కృష్ణగిరి జిల్లా వజ్రపల్లంలో ఉన్న శివాలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. గురువారం రాత్రి వధువు, కుటుంబసభ్యులు, బంధువులు వరుడి ఇంటికి వెళ్లగా అక్కడి దృశ్యం చూసి దిగ్ర్భాంతి చెందారు. ఇంటికి ఎవరు వస్తున్నారో తెలియని విధంగా వరుడు శరవణన్‌ మద్యం మత్తులో ఉన్నాడు. దీనిని గమనించి వధువు, పెళ్లికి ముందే ఇలా ఉంటే భవిష్యతుల్లో ఎలా ఉంటాడో అంటూ అతడితో వివాహం వద్దని తేల్చేసింది. తను ఇక మీదట తాగనని, వివాహం చేసుకోవాలని శరవణన్‌ కోరినా ఆ యువతి అంగీకరించలేదు. పోలీసులు జోక్యం చేసుకున్నా అంగీకరించని వధువు, బంధువులతో కలసి స్వగ్రామానికి వెళ్లిపోయింది.

Updated Date - 2021-12-12T18:54:23+05:30 IST