పెళ్లి తర్వాత వధువునును తీసుకుని ఇంటికి బయల్దేరిన వరుడు.. దారిలో అతనికి దిమ్మదిరిగే షాక్.. పోలీసులను ఆశ్రయిస్తే షాకింగ్ విషయాలు వెల్లడి..!

ABN , First Publish Date - 2022-02-02T18:56:50+05:30 IST

అతను అప్పుడే పెళ్లి చేసుకున్న తన భార్యను తీసుకుని బైక్‌పై ఇంటికి బయల్దేరాడు..

పెళ్లి తర్వాత వధువునును తీసుకుని ఇంటికి బయల్దేరిన వరుడు.. దారిలో అతనికి దిమ్మదిరిగే షాక్.. పోలీసులను ఆశ్రయిస్తే షాకింగ్ విషయాలు వెల్లడి..!

అతను అప్పుడే పెళ్లి చేసుకున్న తన భార్యను తీసుకుని బైక్‌పై ఇంటికి బయల్దేరాడు.. సగం దూరం వెళ్లాక సీటు సౌకర్యంగా లేదని వధువు చెప్పడంతో బైక్ ఆపాడు.. బైక్ దిగిన ఆమె భర్త కళ్ల ముందే వేరే వ్యక్తి బైక్ ఎక్కి వెళ్లిపోయింది.. షాకైన భర్త పోలీసులను ఆశ్రయించాడు.. పారిపోయిన వారిని తర్వాతి రోజు సాయంత్రం  పోలీసులు పట్టుకుని షాకింగ్ నిజాలు వెల్లడించారు.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జబల్పూర్‌కు చెందిన దశరథ్ పటేల్‌కు సోమవారం ఉదయం రేణు పటేల్‌తో వివాహం జరిగింది. వివాహం తర్వాత రేణును తీసుకుని దశరథ్ తన ఇంటికి బైక్‌పై బయల్దేరాడు. సీటు సౌకర్యంగా లేదని చెప్పడంతో మార్గమధ్యంలో దశరథ్ బైక్ ఆపాడు. వారినే అనుసరిస్తున్న భాగ్‌చంద్ అనే వ్యక్తి బైక్ ఎక్కి రేణు వెళ్లిపోయింది. నిర్ఘాంతపోయిన దశరథ్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి రేణు, భాగ్‌చంద్‌తో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.


రేణు తనను ట్రాప్ చేసిందని తెలుసుకుని దశరథ్ షాకయ్యాడు. వివాహం చేసుకుని వరుడికి సంబంధించిన బంగారం, డబ్బుతో పరారవడం రేణుకు అలవాటేనని తెలియడంతో నిర్ఘాంతపోయాడు. రేణు అసలు పేరు ఊర్మిళ అని, ఆమె ఇప్పటికే అలాంటివి నాలుగు పెళ్లిళ్లు చేసుకుందని విచారణలో తేలింది. భాగ్‌చంద్, రేణు ప్రేమికులని, డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తుంటారని తేలింది. రేణు నుంచి బంగారం, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని దశరథ్‌కు అప్పగించారు.

Updated Date - 2022-02-02T18:56:50+05:30 IST