బదిలీలను ఆపడానికి రూ.40 కోట్లు తీసుకున్న దేశ్ముఖ్, పరాబ్
ABN , First Publish Date - 2021-09-18T08:19:44+05:30 IST
ముంబైలో 10మంది డీసీపీలను బదిలీ చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్...
- ఈడీ ముందు సచిన్ వాజే ఆరోపణ
ముంబై, సెప్టెంబరు17: ముంబైలో 10మంది డీసీపీలను బదిలీ చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్, అప్పటి హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్లు వారి వద్ద నుంచి రూ.40 కోట్లు తీసుకున్నట్లు తొలగించబడిన పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఇచ్చిన వివరణలో ఆరోపించారు. వారిద్దరూ చెరో రూ.20 కోట్లు తీసుకున్న విషయం తరువాత తనకు తెలిసిందన్నారు. 2020 జూలైలో పరమ్వీర్ సింగ్ ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో దేశ్ముఖ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాన్డే, వ్యక్తిగత సహాయకుడు కుందన్షిండేలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో ఈ వివరాలు పేర్కొంది. ఈ కేసులో వీరిద్దరూ కీలకపాత్ర పోషించినట్లు తెలిపింది. వాజేను కూడా నిందితుడిగా ఈడీ పేర్కొంది.