ధనురాసనంతో ఊపిరి తేలిక...

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేసే ఆసనాలు వేయాలి. ముఖ్యంగా ధనురాసనం వేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..

ధనురాసనంతో ఊపిరి తేలిక...

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేసే ఆసనాలు వేయాలి. ముఖ్యంగా ధనురాసనం వేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..


  1. నేలపై బోర్లా పడుకోవాలి. తరువాత నెమ్మదిగా చేతులను వెనక్కి తీసుకోవాలి.
  2. కాళ్లను మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి లేవాలి. చేతులతో పాదాలను పట్టుకోవాలి.
  3. ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చుతూ చేతులతో కాళ్లను వీపు వైపు తేవాలి. తలను, ఛాతీ భాగాన్ని వీలైనంత పైకి లేపాలి.
  4. ఈ ఆసనంలో మీ శరీరం ధనస్సులా ఉండాలి. ఆ భంగిమలో ఎంత  వీలైతే అంత సేపు ఉండాలి. 
  5. తరువాత నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రెండు, మూడుసార్లు చేయాలి. 
  6. ఈ ఆసనం వేయడం వల్ల రక్తసరఫరా మెరుగవుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది.

Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST