ధనురాసనంతో ఊపిరి తేలిక...
ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేసే ఆసనాలు వేయాలి. ముఖ్యంగా ధనురాసనం వేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేసే ఆసనాలు వేయాలి. ముఖ్యంగా ధనురాసనం వేస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే..
- నేలపై బోర్లా పడుకోవాలి. తరువాత నెమ్మదిగా చేతులను వెనక్కి తీసుకోవాలి.
- కాళ్లను మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి లేవాలి. చేతులతో పాదాలను పట్టుకోవాలి.
- ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చుతూ చేతులతో కాళ్లను వీపు వైపు తేవాలి. తలను, ఛాతీ భాగాన్ని వీలైనంత పైకి లేపాలి.
- ఈ ఆసనంలో మీ శరీరం ధనస్సులా ఉండాలి. ఆ భంగిమలో ఎంత వీలైతే అంత సేపు ఉండాలి.
- తరువాత నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రెండు, మూడుసార్లు చేయాలి.
- ఈ ఆసనం వేయడం వల్ల రక్తసరఫరా మెరుగవుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది.