13వ రోజు మహాపాదయాత్రకు Break..
ABN , First Publish Date - 2021-11-13T12:43:10+05:30 IST
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజైన శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. అయితే..పాదయాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పు
ప్రకాశం: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 12వ రోజైన శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. అయితే..పాదయాత్ర షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం యాత్ర శనివారం యరజర్ల గ్రామం నుంచి ప్రారంభమై నిడమాలూరు వరకూ సాగి అక్కడ రాత్రికి బస చేయాలి. కానీ నిడమాలూరు పంచాయతీలోని ఒక వార్డుకు ఆదివారం ఎన్నిక జరగనుంది. ఈ కారణంగా బయటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉండటానికి వీలులేదు. దీంతో శనివారం యాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం నుంచి యథావిధిగా యాత్ర కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర 152.9 కిలోమీటర్ల మేర సాగింది.